Header Banner

భారతదేశంలో అతి పెద్ద బంగారు గని! 80 ఏళ్ళ తరువాత రీఓపెన్! ఇక పండగే!

  Fri Jun 13, 2025 14:55        India

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ బంగారు క్షేత్రాలు (KGF) మళ్లీ తెరుచుకోనున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు గానీ, కేంద్ర ప్రభుత్వం ఈ గనులను తిరిగి ప్రారంభించనుందన్న ఊహాగానాలు వెల్లివిరుస్తున్నాయి. 1880 నుంచి 2001 వరకు KGF నుంచి బ్రిటిష్ పాలకులు, ఆ తర్వాత భారత ప్రభుత్వం కలిపి దాదాపు 900 టన్నుల బంగారాన్ని తవ్వారు. అయితే, 2001లో నష్టాల కారణంగా బంగారు తవ్వకాన్ని నిలిపివేశారు. తాజా అధ్యయనాల ప్రకారం, ఇక్కడ ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారాన్ని తవ్వి వెలికితీయవచ్చునని అంచనా. జూన్ 2024లో కేంద్రం భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (BGML) ఆధ్వర్యంలో 1,003 ఎకరాల విస్తీర్ణంలో మైనింగ్ పునఃప్రారంభించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఇక్కడ దాదాపు 32 మిలియన్ టన్నుల గ్రేడెడ్ మెటీరియల్ ఉండగా, దాంతో 23 టన్నుల బంగారం తిరిగి పొందవచ్చని తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

KGF మళ్లీ ప్రారంభమైతే భారతదేశానికి అనేక ప్రయోజనాలు ఉండనున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశంగా ఉన్న భారత్, ప్రస్తుతానికి విదేశాల నుంచి వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. KGF పునఃప్రారంభం వల్ల విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవచ్చు, లక్షల కోట్ల రూపాయల విదేశీ మారకాన్ని ఆదా చేయొచ్చు. చారిత్రాత్మకంగా కూడా KGF ప్రాంతంలో బంగారు తవ్వకాలు చోళ, విజయనగర, మైసూరు కాలం నుంచే కొనసాగుతూ వచ్చాయని శాసనాలు చెబుతున్నాయి. 1970లో BGML ఈ గనులను చేపట్టి మొదట కొన్ని సంవత్సరాలు లాభాల్లో నడిపినా, 1980 తర్వాత నష్టాల బాట పట్టింది. చివరకు 2001లో గనులు మూతపడడంతో KGF శిథిలావస్థకు చేరింది. ఇప్పటికీ అక్కడ బంగారపు నిల్వలు ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. KGF పునరుజ్జీవనంతో భారత బంగారు రంగం పునర్వైభవాన్ని చూసే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

 

మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...

 

వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?

 

10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?

 

 ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KGFReopening #KolarGoldFields #IndiaGoldMine #GoldMiningIndia #KGFReturns #GoldRushIndia #KarnatakaMines #IndianEconomyBoost #MakeInIndia #GoldProduction #BGML #MiningNews #HistoricRevival #GoldReservesIndia #DesiGoldPower